Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో వరద ఉధృతికి కొట్టుకుపోయిన భవనం

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (15:08 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీలోని చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు అపారనష్టం వాటిల్లేలా కనిపిస్తోది. మరోవైపు, లక్షలాది మంది బాధితులు వరద నీటిలో ఉన్నారు. వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇదిలావుంటే, చిత్తూరు జిల్లాలో వరద నీరు ఉధృతికి ఓ భవనం కొట్టుకునిపోయింది. 
 
ఈ జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని తిరుచానూరులో 2 అంతస్తుల భవనం నదిలో కొట్టుకునిపోయింది. ఈ భవనం కూలిపోతున్న దృశ్యాలను స్థానికులు మొబైల్ ఫోనులో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో అది వైరల్ అయింది. 
 
మరోవైపు, తిరుమల గిరులతో పాటు.. తిరుపతి పట్టణంలో జోరు వర్షం కురుస్తుండటంతో తిరుపతి పట్టణం నీట మునిగిపోయింది. దీంతో తిరుపతి పట్టణం ఇపుడు కళావిహీనంగా కనిపిస్తుంది. అనేక మంది బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. జిల్లా యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయికి చేరుకుని వరద సహాయక చర్యలను చేపట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం