Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రశ్నపత్రం లీక్ కేసు : మాజీ మంత్రి నారాయణకు జిల్లా కోర్టు నోటీసులు

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (16:27 IST)
పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పి.నారాయణకు చిత్తూరు జిల్లా కోర్టు నోటీసులు జారీచేసింది. ఈ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ చిత్తూరు జిల్లా కోర్టు ఆయనకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. 
 
ఎస్‌ఎస్‌సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో నారాయణ బెయిల్‌ను రద్దు చేయాలని రాష్ట్ర హైకోర్టు అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు నారాయణకు నోటీసులు జారీ చేసింది. బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు తదుపరి ఈ నెల 24కి వాయిదా వేసింది. ఎస్‌ఎస్‌సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో పోలీసులు పి.నారాయణను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments