Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుదూద్‌ సహాయక చర్యల్లో ఏపీ సర్కారు విఫలం: చిరంజీవి ఫైర్

Webdunia
శనివారం, 18 అక్టోబరు 2014 (20:01 IST)
హుదూద్ తుపాను సహాయక చర్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావే ఏపీ సీఎం చంద్రబాబును మెచ్చుకున్న నేపథ్యంలో.. హుదూద్ తుపాను సహాయక చర్యల్లో ఏపీ సర్కార్ విఫలమైందని కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ఆరోపించారు. 
 
హుదూద్ తుపాను వల్ల ఎంత మంది ప్రాణాలు కోల్పోయారన్న విషయంలో కూడా ప్రభుత్వానికి స్పష్టత లేదని చిరంజీవి మండిపడ్డారు. తుపాను సహాయంపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని అన్నారు.
 
సహాయక చర్యలకు సంబంధించి తాము నిర్ణయాత్మక సూచనలు ఇస్తుంటే... వాటిని విమర్శలుగా భావిస్తున్నారని విమర్శించారు. భాధితులకు వీలైనంత మేలు జరగాలన్నదే తమ తాపత్రయమని చెప్పుకొచ్చారు. 
 
ఇకపోతే.. హుదూద్ తుపాను విలయానికి మృతి చెందిన వారి సంఖ్య 40కి చేరుకుంది. విశాఖ జిల్లాలో 27 మంది, విజయనగరం జిల్లాలో 12 మంది, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మృత్యువాత పడినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments