Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సిద్థంగా ఉండు, జైలు పిలుస్తోంది: చింతామోహన్

Webdunia
బుధవారం, 14 ఏప్రియల్ 2021 (20:14 IST)
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం ముగియడానికి ఇక ఒకరోజు సమయం మాత్రమే ఉంది. దీంతో నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా ఎంపిగాను, కేంద్రమంత్రిగాను పనిచేసిన చింతామోహన్, సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్సలు చేస్తున్నారు. 
 
జగన్ జైలుకెళ్ళడానికి సిద్థంగా ఉండాలని... సూట్ కేసులు, టీషర్టులు, పుస్తకాలు సర్దుకుని రెడీగా ఉండాలన్నారు. జగన్ అవినీతిపరుడని.. నియంత అంటూ మండిపడ్డారు. జగన్ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా స్వాతంత్ర్యం ఉద్యమంలో పాల్గొన్నారా అంటూ ప్రశ్నించిన చింతామోహన్ దేశం కోసం ప్రాణాలర్పించిన వ్యక్తి ఇందిరాగాంధీ అంటూ కొనియాడారు.
 
తన తండ్రిని అడ్డంపెట్టుకుని వేలకోట్లు అక్రమంగా సంపాదించిన వ్యక్తి జగన్ అంటూ ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో అవినీతి, అరాచక ప్రభుత్వాన్ని తరిమికొట్టండని ప్రజలకు కోరారు. కాంగ్రెస్ పార్టీతోనే తిరుపతి అభివృద్థి సాధ్యమని.. తనకు ఎంపిగా ఒక అవకాశం ఇవ్వాలని కోరారు చింతామోహన్. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments