Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనాలు విసిరేసి... చేతులు తెగ్గోసుకుని... పరిశీలక బాలుర వింత నిరసన

Webdunia
మంగళవారం, 30 జూన్ 2015 (07:08 IST)
వారందరూ.. వివిధ నేరాలలో నిందితులుగా ఉంటూ పరిశీలనా గృహంలో ఉన్న వారు. ఒక్క సారిగా తిరగబడ్డారు. తమను వెంటనే విచారించి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అందరిని ఇప్పటికిప్పుడు కుదరదన్నందుకు భోజనాలు విసిరేశారు... గాజు పెంకులతో చేతు కోసుకున్నారు.. నానా బీభత్సం సృష్టించారు. తిరుపతి పరిశీలక బాలల వసతి గృహంలో సోమవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. 
 
తిరుపతి పరిధిలోని మంగళం వద్ద ప్రభుత్వ బాల నేరస్తుల వసతి గృహం ఉంది.  ఇక్కడ నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన బాల నేరస్తులు ఉన్నారు. సోమవారం రాత్రి విచారణ నిమిత్తం న్యాయస్థానం బెంచ్ క్లర్క్ వచ్చారు. అయితే అప్పటికే కూడబల్కుని ఉన్న బాలలు తమను తక్షణం విచారించి విడుదల చేయాలని డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. కేసులు ఎక్కువగా ఉన్నందున సత్వర విడుదల సాధ్యపడదని క్లర్క్ చెప్పడంతో వారు రెచ్చిపోయారు. 
 
ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు, కుర్చీలను విరగ్గొట్టి భోజనాలను కిందికి నెట్టేశారు. గాజు పెంకులతో చేతులు కోసుకున్నారు. అధికారులు బాలనేరస్తులతో చర్చలు జరిపి వారి విడుదలకు సహకరిస్తామని సర్దిచెప్పారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments