Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో రాగి జావకు మంగళం...

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (14:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో పంపిణీ చేస్తున్న రాగి జావను నిలిపివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఒంటిపూట బడుల సాగుతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాగి జావ స్థానంలో చిక్కీలను ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో రాగిజావ పంపిణీ కార్య క్రమం మూణ్నాళ్ల ముచ్చటగా ముగిసింది. 
 
ప్రస్తుత విద్యా సంవత్సరం ఏప్రిల్ నెలాఖరు వరకు ఉన్నప్పటికీ పంపిణీ నిలిపివేయాలంటూ మధ్యాహ్న భోజన విభాగం డైరెక్టర్ నిధి మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాగి జావకు బదు లుగా చిక్కీలు పంపిణీ చేయాలని సూచించారు. పాఠశాలల పనివేళల్లో చేసిన మార్పుల కారణంగా దీనిపై ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 
 
అయితే సవరించిన పనివేళలతో పంపిణీకి వచ్చిన ఇబ్బందేమిటో ఆ ఉత్తర్వుల్లో వివరించలేదు. ఈ ఏడాది మార్చి 21న రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. మంగళ, గురు, శనివారాల్లో పంపిణీ మొదలుపెట్టారు. ఇంతలోనే ఈ ఏడాదికి ఇక చాలంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మాత్రం దానికి ఇంత హడావిడిగా ఎందుకు ప్రారంభించడం ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments