Webdunia - Bharat's app for daily news and videos

Install App

పల్లెల్లో ప్రలోభాలపర్వం.. చికెన్, మటన్, చీరలు, మందు

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (18:30 IST)
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల పోరు చివరి దశకు వచ్చేసరికి పల్లెల్లో ప్రలోభాలపర్వం జోరందుకుంది. పల్లె పగ్గాల కోసం అభ్యర్థులు ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. కొన్ని చోట్ల అడిగినంత ముట్టజెప్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఓటర్లు ఏమడిగితే అది కొనిస్తున్నారు. 
 
ఇక చివరి నిముషంలో చికెన్, మటన్, చీరలు, మందు ఇలా ఓటర్లను కానుకలతో ముంచేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఓటుకు రూ.200 నుంచి రూ.10వేల వరకు పంచిన ఘటనలు ఏపీలో చోటు చేసుకున్నాయి. 
 
ముఖ్యంగా మూడో విడత ఎన్నికల సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి, జంగారెడ్డిగూడెం మండలాల్లో ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.4వేల వరకు పంపిణీ చేశారు. అంతేకాదు సొంతపార్టీకి చందిన చెందిన వారికి తక్కువ మొత్తం.. ప్రత్యర్థి పార్టీకి ఓట్లు వేస్తారనుకున్నవారికి ఎక్కువ మొత్తంలో డబ్బులిచ్చారు.
 
ఇక ఓ గ్రామంలో సర్పంచ్ పదవికి ముగ్గురు అభ్యర్థులు పోటీ పడటంతో పోటీపడి మరీ ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారు. వారిలో ఓ అభ్యర్థి ఓటుకు రూ.1200 ఇవ్వడమే కాకుండా.. కిలో చికెన్, 30 కోడిగుడ్లను పంపిణీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments