సూళ్లూరుపేటలో అతిపెద్ద తెరను ప్రారంభించిన చెర్రీ

Webdunia
గురువారం, 29 ఆగస్టు 2019 (19:44 IST)
దేశంలోని అతిపెద్ద సినిమా తెరను టాలీవుడ్‌ నటుడు, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ గురువారం ప్రారంభించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు దగ్గర్లో దేశంలోనే అతిపెద్ద తెరతో కూడిన మల్టీప్లెక్స్‌ థియేటర్‌ను నిర్మించారు.

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ రూ.40 కోట్లతో పిండిపాళెంలో ఈ థియేటర్‌ను నిర్మించింది. రామ్‌చరణ్‌ ప్రారంభించిన ఈ థియేటర్‌లో ఈ నెల 30న ‘సాహో’ సినిమాను ప్రదర్శించనున్నారు.

దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా 100 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తయిన తెర, 656 సీట్ల సామర్థ్యంతో 3డీ సౌండ్‌ సిస్టమ్‌తో థియేటర్‌ను నిర్మించారు. ఇలాంటి థియేటర్లు ఆసియా ఖండంలో మరో రెండు ఉన్నాయి.

ప్రస్తుతం రామ్‌చరణ్‌ ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలో నటిస్తున్నారు. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్‌ తార ఆలియాభట్‌ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్థానిక సంస్థల్లో పోటీ- ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ జారీ

విద్యార్థులకు శుభవార్త చెప్పిన టి విద్యాశాఖ.. ఫీజుల చెల్లింపులపై క్లారిటీ

కర్నూలు బస్సు ప్రమాదం.. అగ్నికీలల్లో కుటుంబ సభ్యులంతా సజీవదహనం

Palle Panduga 2.0: గ్రామాభివృద్ధికి ఆర్థిక స్థిరత్వం కీలకం.. పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments