సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ఏడేళ్ళ జైలుశిక్ష పడిన బైర్రాజు రామలింగరావు, ఆయన సోదరుడు బి. రామరాజులు చర్లపల్లి జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. అయితే, ఖైదీల అంతర్జాతీయ క్రీడోత్సవాలను పురస్కరించుకుని బుధవారం చర్లపల్లి జైల్లో ఖైదీల మధ్య ఆటల పోటీలు జరిగాయి.
ఈ క్రీడల్లో భాగంగా ఖైదీలు టీ20 క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. చర్లపల్లి, వరంగల్ జైలు ఖైదీల జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్లో వరంగల్ జట్టు విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యచ్ను జైల్లోని మొత్తం 943 మంది ఖైదీలు ఆసక్తిగా వీక్షించారు.
అయితే, సత్యం కంప్యూటర్స్ కేసులో దోషులుగా తేలి ఇటీవలే జైలుకు వెళ్లిన రామలింగరాజు అండ్ కో మాత్రం ఈ మ్యాచ్ను చేసేందుకు బయటకు రాలేదని జైలు వర్గాలు పేర్కొంటున్నాయి. వీరంతా తమకు కేటాయించిన బ్యారక్ లకే పరిమితమయ్యారట.