Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదుగో చిరుత... తిరుమలలో అర్థరాత్రి కలకలం.. భయంతో భక్తుల పరుగులు

తిరుమలలో అర్థరాత్రి చిరుత భక్తులను హడలెత్తించింది. పద్మావతినగర్‌లోని నర్సింగ్‌ సదన్‌ విశ్రాంతి గృహంలోకి ఒక చిరుత ప్రవేశించింది.

Webdunia
మంగళవారం, 26 జులై 2016 (11:36 IST)
తిరుమలలో అర్థరాత్రి చిరుత భక్తులను హడలెత్తించింది. పద్మావతినగర్‌లోని నర్సింగ్‌ సదన్‌ విశ్రాంతి గృహంలోకి ఒక చిరుత ప్రవేశించింది. నర్సింగ్‌ సదన్‌ వెనుకే అటవీ ప్రాంతం ఉండడంతో చిరుత వచ్చినట్లు అటవీశాఖాధికారులు చెబుతున్నారు. నర్సింగ్‌ సదన్‌లోని మొదటి అంతస్తులోకి చిరుత ప్రవేశించింది. 
 
చిరుతను చూసిన అక్కడ పనిచేసే సిబ్బంది వెంకటేష్‌, ప్రభాకర్‌లు రెండవ అంతస్తుకు పరుగులు తీశారు. వీరిద్దరు భవనంపైకి ఎక్కి మరొక భవనంపై ఎక్కి కిందకు దిగి తితిదే, అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అటవీ, అగ్నిమాపక, తితిదే విజిలెన్స్, పోలీసు శాఖలు రంగగంలోకి దిగి మంగళవారం తెల్లవారుజాము వరకు చిరుతను పట్టుకునే ప్రయత్నం చేశారు.
 
అయితే చిరుత నర్సింగ్‌ సదన్‌ నుంచి మెల్లగా తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. చిరుత ఉందన్న విషయం తెలుసుకున్న నర్సింగ్‌ సదన్‌లో గదులు అద్దెకు తీసుకున్న భక్తులు భయాందోళనతో పరుగులు తీశారు. అయితే అటవీశాఖాధికారులు వారికే ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. చిరుత అటవీప్రాంతంలోకి వెళ్ళిపోయిందని తెలుసుకున్న భక్తులు వూపిరి పీల్చుకున్నారు. 

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments