Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి జూ పార్కు రోడ్డులో చిరుత చక్కర్లు... బెంబేలెత్తిపోయిన స్థానికులు

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (09:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటైన తిరుమల తిరుపతిలో ఈ మధ్యకాలంలో క్రూరమృగాలు జనావాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా, కరోనా లాక్డౌన్ కారణంగా తిరుమల ఘాట్ రోడ్లపై ఇవి యధేచ్చగా సంచరిస్తున్నాయి. అయితే, తాజాగా తిరుపతి పట్టణంలోని జూ పార్కు రోడ్డులో ఓ చిరుత పులి చక్కర్లు కొట్టడాన్ని స్థానికులు గుర్తించి హడలిపోయారు. 
 
పక్కనే ఉన్న కొండలపై నుంచి జనావాసంలోకి వచ్చిన ఈ చిరుత.. పలువురు బైకర్లపై దాడికి దిగినట్టు వార్తలు వస్తున్నాయి. ద్విచక్రవాహనాలపై వెళుతున్న వారిని అది చాలా దూరం వెంబడించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ చిరుత దాడిలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. 
 
కొద్దిసేపు హంగామా సృష్టించిన తర్వాత ఈ చిరుత పులి కనిపించకుండా పోయింది. దీంతో ఇది తిరిగి అడవుల్లోకి వెళ్లిందా? లేక నగరంలోనే ఎక్కడైనా దాక్కుందా? అన్న విషయం తెలియడం లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ చిరుతపులి జూ పార్క్ నుంచి తప్పించుకుని వచ్చినది కాదని తెలుస్తోంది. దీన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments