Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంట పొలాల్లో చార్టెడ్ ప్లేన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

Webdunia
సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (12:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఓ చిన్నపాటి విమానం ఒకటి పొలాల్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇంజిన్‌లో సాంకేతిక లోపం కారణంగా ఈ విమానం ల్యాండ్ అయింది. 
 
నింగిలో ఎగురుతున్న సమయంలో ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్టు పైలటు గుర్తించాడు. దీంతో అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు సమీపంలో ఎక్కడా విమానాశ్రయం లేదని గ్రహించిన పైలెట్... బ్రహ్మసముద్రం మండలం ఎరడికెరాలో విమానం పొలాల్లో దిగింది. 
 
ఈ విమానం కర్ణాటకకు చెందిన ఓ ఎంఎన్సీదిగా గుర్తించారు. విమానం ల్యాండ్ అయిన ప్రాంతం చదునుగా ఉండటంతో, ప్రయాణికులకు స్వల్ప గాయాలు మినహా మరే ప్రమాదమూ జరగలేదని తెలుస్తోంది. 
 
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, విమానం వద్దకు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. విమానం ఎమర్జెన్సీ మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments