Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యుత్ స్లాబులు మార్చడం దుర్మార్గం: కన్నా

Webdunia
మంగళవారం, 19 మే 2020 (21:10 IST)
ఏపీ సీఎం జగన్ పై రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నాలక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరోనా కారణంగా ప్రజలందరూ ఎంతో ఇబ్బందిపడుతున్నారని, ఇలాంటి సమయంలో విద్యుత్ చార్జీలు పెంచడం దారుణమని అభిప్రాయపడ్డారు.

లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లలో ఉన్న సమయంలో విద్యుత్ స్లాబులు మార్చడం దుర్మార్గం అని పేర్కొన్నారు. ప్రజల పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వం అని విమర్శించారు.

సహజంగానే ప్రజలు ఇళ్లలో ఉంటే విద్యుత్ వాడకం పెరుగుతుందని,  కానీ గతంలో కంటే రెండు, మూడు రెట్లు అధికంగా బిల్లులు రావడం ఆమోదయోగ్యం కాదని అన్నారు.

మార్చి నెలలో తాను రూ.11 వేల మేర విద్యుత్ బిల్లు చెల్లించానని, ఈ నెలలో బిల్లు రూ.20 వేలు దాటిందని వెల్లడించారు. ఇది విద్యుత్ చార్జీలు పెంచడం కాక మరేమిటి? అని ప్రశ్నించారు.

ఎంతో తెలివిగా విద్యుత్ స్లాబులు మార్చిన ప్రభుత్వం చార్జీలు మాత్రం పెంచలేదని చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments