Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెన్షన్లు టీడీపీ ఆపినట్టు వైకాపా ప్రచారం చేస్తుంది... ఈసీ అభ్యంతరం చెప్పింది : చంద్రబాబు

ఠాగూర్
ఆదివారం, 31 మార్చి 2024 (17:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధాప్య, వితంతు పెన్షన్ల పంపిణీకి ఎన్నికల సంఘం అభ్యంతరం చెప్పిందని, తెలుగుదేశం పార్టీ కాదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయడానికి వీల్లేదని చెప్పిందన్నారు. అందువల్ల ప్రభుత్వమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎన్నికల ముఖ్య అధికారి ముఖేశ్ మీనాలకు చంద్రబాబు లేఖ రాశారు.
 
మరోవైపు, ఏపీలో ఏప్రిల్ ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేస్తారా లేదా అనే అంశంపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ప్రజలకు ఊరటనిచ్చింది. పెన్షన్ల పంపిణీకి తమకేమీ అభ్యంతరం లేదని, అయితే, పెన్షన్లు అందించేందుకు వాలంటీర్లను వినియోగించవద్దని స్పష్టం చేసింది. దీనిపై చంద్రబాబు నాయుడు స్పందించారు. 
 
ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎన్నికల ప్రధానాధికారికి ఆయన లేఖ రాశార. వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతంరాలు తెలిపిన నేపథ్యంలో ఏపీలో పెన్షన్లు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు కోరారు. లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, డోర్ టు డోర్ విధానంలో పెన్షన్లు అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. 
 
మరోవైపు, ప్రభుత్వ ఖజానాలో నిధులు లేని కారణంగా పెన్షన్లు పంపిణీ నిలిచిపోకూడదని అన్నారు. ప్రభుత్వం వెంటనే అవసరమైన నిధులు కేటాయించి పెన్షన్లు పంపిణీని పూర్తి చేయాలని ఆయన కోరారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments