Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారాయణ అరెస్టుపై గవర్నర్ - అమిత్ షాకు లేఖ రాసిన చంద్రబాబు

Webdunia
బుధవారం, 11 మే 2022 (12:31 IST)
తెలుగుదేశం పార్టీ  సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌పై జోక్యం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర గవర్నర్ హరిచందన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. రాజకీయ ప్రతీకారం తీర్చుకునేందుకు వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నారాయణను అరెస్టు చేసిందని లేఖలో చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 
 
అమిత్ షా జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. ఎస్‌ఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి పోలీసులు నారాయణను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అరెస్టు చేసి చిత్తూరుకు తరలించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన సంగతి తెలిసిందే. 
 
అయితే, ప్రశ్నపత్రాలు లీకే కాలేదని రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ చెబుతుంటే ప్రశ్నపత్రాల లీక్ కేసులో నారాయణను అరెస్టు చేసినట్టు ఏపీ సీబీఐ చెప్పడం వింతగా ఉందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. 
 
ప్రశ్నపత్రం లీకేజీ కేసులో అదనపు సెక్షన్లు జోడించి అరెస్టు చేశారని బాబు తన లేఖలో పేర్కొన్నారు. చిత్తూరు ఎస్పీ వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. 
 
ఈ సందర్భంగా వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు ఘటనను కూడా బాబు తన లేఖలో ప్రస్తావించారు. కాగా, ఈకేసులో నారాయణకు బెయిల్ లభించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments