Webdunia - Bharat's app for daily news and videos

Install App

2024లో చంద్రబాబు చస్తారు.. జగన్ మళ్లీ సీఎం అవుతారు : వైకాపా ఎంపీ గోరంట్ల

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2023 (12:03 IST)
వైకాపాకు చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధమ్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2024లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చస్తారని, తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారంటూ ఆయన జోస్యం చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. 
 
వైకాపా చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో పాల్గొన్న గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ, 2024లో చంద్రబాబు చస్తారని, జగన్ సీఎం అవుతారని చెప్పారు. చంద్రబాబు బస్సు యాత్ర చేసి ఇపుడు జైలు యాత్ర చేస్తున్నారని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేసి ఇపుడు పారిపోయే యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 
 
ఇక నారా లోకేశ్ యువగళం యాత్ర చేసి ఇపుడు ఢిల్లీ చుట్టూ తిరిగే యాత్ర చేస్తున్నారని అన్నారు. లోకేశ్ పాదయాత్రను పక్కనపెట్టి పారిపోయారన్నారు. మరోవైపు, చంద్రబాబును ఉద్దేశించి ఈ వైకాపా ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఇపుడు టీడీపీ శ్రేణుల్లో కలకలం రేపుతున్నాయి. జైల్లో చంద్రబాబుకు ఏదైనా అపకారం తలపెట్టే అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

'హరి హర వీరమల్లు'తో పాన్ ఇండియా విజయాన్ని అందుకుంటాం : నిర్మాత ఏ.ఎం.రత్నం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

తర్వాతి కథనం
Show comments