Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం విలీన మండలాల్లో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన

Webdunia
గురువారం, 28 జులై 2022 (10:28 IST)
పోలవరం విలీన మండలాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నుంచి పర్యటించనున్నారు. ఆయన నేటి నుంచి రెండు రోజుల పాటు పర్యటిస్తారు. ఇటీవల తెలంగాణాలో కురిసిన భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగింది. 
 
దీంతో కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలోని అనేక గ్రామాలు నీట మునిగాయి. ముఖ్యంగా పోలవరం విలీన మండలాలు పూర్తిగా మునిగిపోయాయి. ఈ ప్రాంతాల్లో ఆయన రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ముఖ్యంగా, భద్రాద్రి జిల్లాలో బూర్గంపహాడ్ ముంపు ప్రాంతాల్లోని బాధితులను కూడా చంద్రబాబు పరామర్శించనున్నారు. 
 
ఇందుకోసం ఆయన గురువారం ఉదయం 8 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి చంద్రబాబు బయలుదేరి వెళ్తారు. వేలేరుపాడు, కుక్కనూరు మండలాల్లో బాధితులను పరామర్శిస్తారు. ఆ తర్వాత తెలంగాణాలోని భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ ముంపు ప్రాంతాల్లోని బాధితుల చెంతకు వెళ్లి వారిని పరామర్శిస్తారు. తొలిరోజు పర్యటన తర్వాత చంద్రబాబు భద్రాద్రిలోనే బస చేస్తారు. శుక్రవారం ఎటపాక, కూనవరం, వీఆర్ పురం మండలాల్లోని తోటపల్లి, కోతుగట్ట, కూనవరం, రేఖపల్లి ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన సాగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments