Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం విలీన మండలాల్లో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన

Webdunia
గురువారం, 28 జులై 2022 (10:28 IST)
పోలవరం విలీన మండలాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నుంచి పర్యటించనున్నారు. ఆయన నేటి నుంచి రెండు రోజుల పాటు పర్యటిస్తారు. ఇటీవల తెలంగాణాలో కురిసిన భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగింది. 
 
దీంతో కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలోని అనేక గ్రామాలు నీట మునిగాయి. ముఖ్యంగా పోలవరం విలీన మండలాలు పూర్తిగా మునిగిపోయాయి. ఈ ప్రాంతాల్లో ఆయన రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ముఖ్యంగా, భద్రాద్రి జిల్లాలో బూర్గంపహాడ్ ముంపు ప్రాంతాల్లోని బాధితులను కూడా చంద్రబాబు పరామర్శించనున్నారు. 
 
ఇందుకోసం ఆయన గురువారం ఉదయం 8 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి చంద్రబాబు బయలుదేరి వెళ్తారు. వేలేరుపాడు, కుక్కనూరు మండలాల్లో బాధితులను పరామర్శిస్తారు. ఆ తర్వాత తెలంగాణాలోని భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ ముంపు ప్రాంతాల్లోని బాధితుల చెంతకు వెళ్లి వారిని పరామర్శిస్తారు. తొలిరోజు పర్యటన తర్వాత చంద్రబాబు భద్రాద్రిలోనే బస చేస్తారు. శుక్రవారం ఎటపాక, కూనవరం, వీఆర్ పురం మండలాల్లోని తోటపల్లి, కోతుగట్ట, కూనవరం, రేఖపల్లి ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన సాగుతుంది. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments