Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు గుంటూరులో చంద్రన్న కానుక పంపిణీ...

Webdunia
ఆదివారం, 1 జనవరి 2023 (09:21 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం గుంటూరులో పర్యటించనున్నారు. గుంటూరు సదాశివ నగరులోని వికాస్ హాస్టల్ మైదానంలో జరిగే చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఉయ్యూరు ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు అన్నగారి జనతా వస్త్రాలు, చంద్రన్న  సంక్రాంతి కానుకలను పంపిణీ చేస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు ఈ కార్యక్రమం జరుగనుంది. 
 
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏపీలో చంద్రన్న కానుక పేరుతో ప్రజలకు నిత్యావసర సరకుల్ని పంపిణీ చేసింది. ప్రభుత్వం మారిన తర్వాత ఆ పథకాన్ని రద్దు చేసింది. అయితే, అధికారంలో లేకపోయినప్పటికీ టీడీపీ ఆధ్వర్యంలో వివిధ ట్రస్టుల ద్వారా పేదలకు జనతా వస్త్రాలతో పాటు చంద్రన్న కానుకలను పంపిణీ చేస్తుంది. 
 
గుంటూరు సదాశివ నగరులోని వికాస్ హాస్టల్ మైదానంలో జరిగే ఈ కార్యక్రమంలో దాదాపు 30 వేల మందికి వీటిని అందజేయనున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొని వీటిని అందచేస్తారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments