Webdunia - Bharat's app for daily news and videos

Install App

2018 నాటికి పోలవరం పూర్తి చేస్తాం.. నీరందిస్తాం : చంద్రబాబు

Webdunia
గురువారం, 2 జులై 2015 (16:43 IST)
వచ్చే 2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి నీరు అందిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన సందర్భంగా పోలవరం ప్రాజెక్టుపై ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం పనుల పురోగతిపై కేబినెట్‌లో ఎప్పటికప్పుడు చర్చిస్తామన్నారు. గత ప్రభుత్వం అమలు చేయని పునరావాస ప్యాకేజీని కూడా తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. 
 
ప్రభుత్వసాయం లేకున్నా కాంట్రాక్టర్లు పనులు చేయడాన్ని ఆయన ప్రశంసించారు. గోదావరి వరదలతో పట్టిసీమ ప్రాజెక్టు పనులకు అంతరాయం కలుగుతోందని అన్నారు. వచ్చే ఆగస్టు 15 నాటికి గోదావరి నీటిని కుడి కాలువకు మళ్లిస్తామని చంద్రబాబు తెలిపారు.
 
ఇకపోతే.. పగో జిల్లాలో తీరప్రాంతం తక్కువగా ఉందన్నారు. అటవీభూములకు క్లియరెన్స్‌ అడిగామని.... అది వచ్చాక పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గోదావరి కాలువలకు మరమ్మతులు చేసి చివరి భూములకు నీరు అందేలా చూస్తామన్నారు. మెట్ట ప్రాంతాలకు లిఫ్ట్‌లతో సాగునీరందించనున్నట్లు చెప్పారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments