Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రైతులు ధరలు పెరిగాక భూములు అమ్మరని గ్యారెంటీనా... పవన్ చర్చపై బాబు

Webdunia
గురువారం, 5 మార్చి 2015 (14:45 IST)
పవన్ కళ్యాణ్ ఎదుట తమ భూములను ఇచ్చేది లేదంటూ తమ అభిప్రాయాలను చెప్పిన రైతుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. రాజధాని పరిధిలో ఉన్న రైతుల భూములను తీసుకోవడం వారి మేలు కోసమే అని అన్నారు. ఐతే కొంతమంది రైతులు భూములు ఇవ్వక పోవడానికి కారణం... వారు వ్యవసాయం చేయడానికి కాదనీ, రాజధాని నగరం నిర్మించాక ఆ ప్రాంతంలో భూముల ధరలు పెరుగుతాయి కనుక అప్పుడు అమ్ముకోవచ్చనేది వారి ఆలోచనగా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు భూములు ఇవ్వనని మొరాయిస్తున్న రైతులంతా తమ జీవితాంతం అక్కడ వ్యవసాయమే చేస్తామని చెప్పగలరా అంటూ ఆయన ప్రశ్నించారు. 
 
ఇప్పటికే 80 శాతానికి పైగా రైతులు తమతమ భూములను స్వచ్చందంగా ప్రభుత్వానికి అప్పగించారని చెప్పారు. వారంతా ప్రభుత్వం రాజధానిని నిర్మిస్తే తమకు లాభం చేకూరుతుందని భావిస్తూ అలా చేశారని వెల్లడించారు. మిగిలినవారు కూడా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నడుచుకోవాలన్నారు. పార్టీలు కూడా దూరదృష్టితో ఆలోచన చేయాలని పరోక్షంగా పవన్ కళ్యాణ్ కు చురకలు అంటించారు.

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

Show comments