టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

ఠాగూర్
బుధవారం, 28 మే 2025 (18:02 IST)
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోమారు ఎంపికయ్యారు. కడప వేదికగా జరుగుతున్న ఆ పార్టీ జాతీయ మహానాడులో ఆయనను పార్టీ అధ్యక్షుడుగా పార్టీ నేతలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 
 
పార్టీ అధ్యక్ష పదవికి చంద్రబాబు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఎన్నుకున్నట్టు పార్టీ నాయకత్వం అధికారికంగా ప్రకటించింది. ఆయన ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారు. 
 
కాగా, చంద్రబాబు నాయుడు తొలిసారి 1995లో టీడీపీ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి గత మూడు దశాబ్దాలుగా ఆయన పదవిలో కొనసాగుతున్నారు. 2014 రాష్ట్ర విభజన వరకు పార్టీ అధ్యక్షుడుగా ఉండగా, ఆ తర్వాత ఆయన జాతీయ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. 
 
చంద్రబాబుకు పార్టీపై ఉన్న పట్టుదల, ప్రజల సమస్యలపై ఆయన చేస్తున్న కృషి, నాయకత్వం నైపుణ్యం ఇలా అనేక అంశాలు ఆయనను మరోమారు అగ్రస్థానానికి చేర్చాయి. ఈ ఎన్నిక ద్వారా ఆయన నాయకత్వానికి పార్టీలో మద్దతు మరోమారు స్పష్టమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments