Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

ఠాగూర్
బుధవారం, 28 మే 2025 (18:02 IST)
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోమారు ఎంపికయ్యారు. కడప వేదికగా జరుగుతున్న ఆ పార్టీ జాతీయ మహానాడులో ఆయనను పార్టీ అధ్యక్షుడుగా పార్టీ నేతలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 
 
పార్టీ అధ్యక్ష పదవికి చంద్రబాబు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఎన్నుకున్నట్టు పార్టీ నాయకత్వం అధికారికంగా ప్రకటించింది. ఆయన ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారు. 
 
కాగా, చంద్రబాబు నాయుడు తొలిసారి 1995లో టీడీపీ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి గత మూడు దశాబ్దాలుగా ఆయన పదవిలో కొనసాగుతున్నారు. 2014 రాష్ట్ర విభజన వరకు పార్టీ అధ్యక్షుడుగా ఉండగా, ఆ తర్వాత ఆయన జాతీయ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. 
 
చంద్రబాబుకు పార్టీపై ఉన్న పట్టుదల, ప్రజల సమస్యలపై ఆయన చేస్తున్న కృషి, నాయకత్వం నైపుణ్యం ఇలా అనేక అంశాలు ఆయనను మరోమారు అగ్రస్థానానికి చేర్చాయి. ఈ ఎన్నిక ద్వారా ఆయన నాయకత్వానికి పార్టీలో మద్దతు మరోమారు స్పష్టమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments