హల్లో నాని... నేను, ఏంటి పార్టీ మారుతున్నావట.. నానికి చంద్రబాబు ఫోను

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (18:26 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన ఢిల్లీలోని బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నట్టు జోరుగా కథనాలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేశినేని నానితో టీడీపీకి చెందిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా విజయవాడలో సమావేశమై మంతనాలు జరిపారు. ఆ తర్వాత నాని పార్టీ మారడం లేదంటూ మీడియాకు వెల్లడించారు. 
 
ఈ నేపథ్యంలో కేశినేని నానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఫోన్ చేసి.. తన నివాసానికి రావలసిందిగా కోరినట్టు తెలుస్తోంది. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతల నియామక విషయంలో ఇటీవల జరిగిన పరిణామాలు నానికి మనస్తాపం కలిగించాయన్నది లోగుట్టు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆయనను పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 
 
మరోవైపు, నాని బీజేపీలో చేరవచ్చంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి బలం చేకూర్చేలా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని నాని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో నాని పార్టీ మారడం ఖాయమంటున్నారు. ఇపుడు నానికి చంద్రబాబు ఫోన్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది. 
 
మొత్తంమీద కేశినేని నాని అంశం ఇపుడు టీడీపీలో కలకలం రేపుతోంది. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ 25 ఎంపీ సీట్లకుగాను కేవలం మూడు ఎంపీలు గెలిచారు. వారిలో ఒకరు కేశినేని నాని. విజయవాడ లోక్‌సభ స్థానం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments