Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలోని ముఖ్యమంత్రుల్లో శ్రీమంతుడు ఎవరు?

దేశంలో మొత్తం 31 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. వీరిలో అత్యంత ధనవంతుడైన సీఎం ఎవరో తెలుసా? సాక్షాత్ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే. ఏడీఆర్‌ (అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌) అనే సంస్థ నిర

Webdunia
మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (08:54 IST)
దేశంలో మొత్తం 31 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. వీరిలో అత్యంత ధనవంతుడైన సీఎం ఎవరో తెలుసా? సాక్షాత్ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే. ఏడీఆర్‌ (అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌) అనే సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ఈయన చర, స్థిరాస్తులు రెండూ కలిపితే చంద్రబాబు వ్యక్తిగత సంపద రూ.177 కోట్లుగా ఏడీఆర్ లెక్కగట్టింది. 
 
ఏడీఆర్ వెల్లడించిన నివేదిక ప్రకారం చంద్రబాబుకు రూ.134,80,11,728 విలువైన చరాస్తులు, రూ.42,68,83,883 విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఈ రెండూ కలిపితే చంద్రబాబు ఆస్తుల విలువ రూ.177,78,95,611 ఉన్నట్లు ఏడీఆర్‌ సంస్థ వెల్లడించింది. చంద్రబాబు తర్వాత రెండో ధనిక సీఎం... అరుణాచల్‌ ముఖ్యమంత్రి పెమా ఖండూ. ఈయన ఆస్తుల విలువ రూ.129కోట్లకుపైగా ఉంది. మూడో స్థానం పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌ది.
 
ఇక 15 కోట్ల విలువైన ఆస్తులతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ నాలుగో ధనిక సీఎంగా ఉన్నారు. కేసీఆర్‌ దగ్గర రూ.6,50,82,464 విలువైన చరాస్తులు, రూ.8.65 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. సీపీఎంకు చెందిన త్రిపుర సీఎం మాణిక్‌ సర్కార్‌ ఆస్తుల విలువ రూ.26 లక్షల 83 వేల 195 మాత్రమే. పేద సీఎంల జాబితాలో రెండో స్థానంలో వెస్ట్ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (రూ.30 లక్షలు), మూడో స్థానంలో జమ్మూ కాశ్మీర్‌ సీఎం మెహబూబా ముఫ్తీ  (రూ.55 లక్షలు) ఉన్నారు. మమతా బెనర్జీ దగ్గర ఒక్క రూపాయి కూడా విలువ చేసే స్థిరాస్తి లేకపోవడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments