Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఈ-కేబినెట్ భేటీ.. ఓ లుక్కేసిన నరేంద్ర మోడీ కార్యాలయం!

Webdunia
సోమవారం, 15 సెప్టెంబరు 2014 (17:14 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినూత్న రీతిలో సోమవారం నిర్వహించిన ఈ-క్యాబినెట్ సమావేశం (కాగితరహిత భేటీ)పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయం (పీఎంఓ) ఓ లుక్కేసింది. ఈ-కేబినెట్ సమావేశం ఎలా నిర్వహించారన్న అంశంపై ఆసక్తి చూపిన పీఎంఓ.. ఈ-కేబినెట్ నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను తమకివ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. 
 
సోమవారం చంద్రబాబు నేతృత్వంలో నిర్వహించిన కేబినెట్ భేటీని కాగితం, పెన్ను లేకుండా సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు జరిగింది. ఈ భేటీ కోసం ఐపాడ్లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లతో సమావేశం నిర్వహించారు. దాంట్లో పలు పథకాలపై చర్చించారు. ఈ భేటీకి మీడియా విశేష ప్రచారం కల్పించింది. దీంతో, ప్రధాని కార్యాలయం కూడా ఇటువైపు ఓ కన్నేసింది. ఏపీ సర్కారు జరిపిన హై-ఫై భేటీకి సంబంధించిన వివరాలు అందించాలని అధికారులను కోరింది. 
 
అంతముందు.. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం నాలుగు గంటలకు పైగా జరిగింది. వందరోజుల పాలన... మంత్రుల పనితీరు తదితర విషయాలపై కేబినెట్ చర్చించింది. దేశంలోనే తొలి ఈ-కేబినెట్ సమావేశంగా ఈ భేటీ చరిత్ర సృష్టించింది. తొలిసారిగా కాగిత రహిత కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి ఏపీ సర్కార్ అందరినీ ఆశ్చర్యపరిచింది. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments