Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేఈకి చంద్రబాబు కౌంటర్... రాజధాని భూమిపూజకు మోడీకి ఇన్వైట్

Webdunia
శనివారం, 23 మే 2015 (18:16 IST)
కర్నూలుపై దృష్టిసారించలేదన్న ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కౌంటర్ అటాక్ ఇచ్చారు. ఒక పార్టీ అధినేతగా తనకు అన్ని ప్రాంతాలను సమానమని, అన్ని ప్రాంతాలను సమానంగానే అభివృద్ధి చేస్తానని చెప్పారు. చరిత్రలో చేయనంత అభివృద్ధిని కర్నూలుకు చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ జిల్లాకు విరివిగా పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు.
 
ఈ విషయాన్ని పార్టీ నేతలు గుర్తు పెట్టుకోవాలన్నారు. అలాగే, ఏం చేయాలో చెపితే బాగుంటుందన్నారు. అదేసమయంలో ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు తనపై అపార నమ్మకం ఉందన్నారు. పట్టిసీమపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా గోదావరి ప్రజలు నమ్మలేదన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని తప్పకుండా ఆదరిస్తామన్నారు.
 
రాష్ట్రంలో పరిస్థితిపై ప్రత్యేకంగా మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. గ్రామాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఎప్పటికప్పుడు టీవీలు, పేపర్ల ద్వారా ప్రచారం కల్పిస్తున్నామని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాజధాని కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చిన రైతులను అభినందిస్తున్నామన్నారు.  
 
ఆంధ్రప్రదేశ్ రాజధాని భూమి పూజకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించాలని నిర్ణయించినట్టు తెలిపారు. రాజధాని నిర్మాణానికి జూన్ 6 ఉదయం 8.49 నిమిషాలకు భూమి పూజ జరుగుతుందని చెప్పారు. విజయదశమి నుంచి రాజధాని పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments