Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.100 నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ.. త్వరలోనే చెలామణిలోకి...

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (10:21 IST)
దివంగత నటుడు, మహానేత ఎన్.టి.రామారావు బొమ్మతో కూడిన వంద రూపాయల నాణెం అందుబాటులోకి రానుంది. ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల నాణెంను ముద్రించేందుకు భారత రిజర్వు బ్యాంకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రతిపాదిత నాణెం నమూనాను కూడా ముద్రించారు. దీన్ని ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి, ఏపీ బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరికి ఆర్బీఐ మింట్ అధికారులు చూపించారు. ఈ నాణెం నమూనాపై ఆమె నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఈ నమూనాకు కూడా ఆమె ఓకే చెప్పినట్టు సమాచారం. దీంతో త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మతో కూడా వంద రూపాయల నాణె చెలామణిలోకి వచ్చే అవకాశం ఉంది.
 
మరోవైపు, ఎన్టీఆర్ ట్రస్ట్ వ్యవస్థాపక దినోత్సవాన్ని బుధవారం నిర్వహిస్తున్నారు. దీనిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. పేదలు, బలహీన వర్గాలకు సాయపడాలన్న ఉద్దేశ్యంతో ఏర్పడిన ఈ ట్రస్ట్‌కు వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటుందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు చెప్పారు. 
 
అలాగే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందిస్తూ, మాహానాయుడు ఎన్టీఆర్ ఆశయాలు, ఆచరణ రూపం ఎన్టీఆర్ ట్రస్టుగా అభివర్ణించారు. విపత్తుల వేళ బాధితులను ఆదుకోవడంలోనూ విద్య వైద్య విజ్ఞాన ఉపాధి రంగాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments