Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి కంటే విశాఖపట్టణమే బాగుంది : చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (16:49 IST)
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి కంటే విశాఖపట్ణమే బాగుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకే నవ్యాంధ్రకు ఏపీ అత్యంత కీలక నగరమన్నారు. స్మార్ట్ సిటీల అభివృద్ధికి సహకరిస్తామన్న అమెరికాతో ఒప్పందం కుదిరిన వేళ, చంద్రబాబు ప్రసంగిస్తూ, కేంద్రం ప్రకటించిన తొలి జాబితాలోనే స్మార్ట్ సిటీగా విశాఖ ఎంపికైందని గుర్తుచేశారు. 
 
అమరావతి నగరం నిర్మాణం పూర్తయ్యేసరికి ఎంతో కాలం పడుతుందని వెల్లడించిన ఆయన, ఈలోగా రాష్ట్రాభివృద్ధికి కేంద్రంగా విశాఖ నిలవనుందన్నారు. హుదూద్ తుఫాను నుంచి తేరుకుని తలెత్తుకు నిలబడ్డ నగరంలో రెండు ప్రధాన సదస్సులు జరిగాయని, అంతర్జాతీయ నావికా సమీక్ష జరిగిందని తెలిపారు. 
 
గతంలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో 40 దేశాలు పాల్గొన్నాయని ఆయన గుర్తుచేశారు. అమెరికా ప్రభుత్వం, ఆ దేశ సంస్థలతో కలసి పనిచేయడం తనకు లభించిన అద్భుతమైన అవకాశంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం 7.52 శాతంగా ఉన్న రాష్ట్రాభివృద్ధిని రెండంకెలు దాటించడమే తన ముందున్న తొలి లక్ష్యమన్నారు. 

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments