Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ అక్రమాస్తులు ప్రభుత్వానికి ఇచ్చేయాలి.. అగ్రిగోల్డే బెటర్: చంద్రబాబు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ను అడ్డుపెట్టుకుని అక్రమంగా సంపాదించిన ఆస్తులను వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇచ్చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీలో ప్రతిపక్షమే లేకుండా చేస్తామని తాను

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (11:55 IST)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ను అడ్డుపెట్టుకుని అక్రమంగా సంపాదించిన ఆస్తులను వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇచ్చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీలో ప్రతిపక్షమే లేకుండా చేస్తామని తాను ఎన్నడూ అనలేదని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో 80శాతం మంది ప్రజలు ఆనందంగా ఉంటే, వారి ఓట్లు టీడీపీకే పడతాయని... అలాంటప్పుడు ఇతర పార్టీకి అవకాశం ఎక్కడ ఉంటుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 
 
పనిలో పనిగా జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2004 నాటికి జగన్ తన వద్ద ఉన్న ఆస్తులను అట్టిపెట్టుకుని.. ఆ తర్వాత సంపాదించిన ఆస్తుల్ని అప్పగించాలన్నారు. జగన్ తెలివైనవాడు కనుక... 2004 వరకు ఆయన వద్ద ఉన్న ఆస్తులతో వ్యాపారం చేసినా.. 20 శాతం సంపాదించుకున్నాడు అనుకోవచ్చు. ఆ మొత్తంతో పాటు మరో 20 శాతం అదనంగా వుంచుకుని, మిగిలినదాన్ని ప్రభుత్వ పరం చేయాలని సూచించారు.
 
అలా చేస్తే, జగన్ నిజాయతీ ప్రజలకు అర్థమవుతుందని చంద్రబాబు అన్నారు. ఏపీలో అక్రమాలకు పాల్పడే వారికి స్థానం లేదన్నారు. జగన్ కంటే అగ్రిగోల్డ్ లాంటి సంస్థలే బెటర్ అని... వాటి ఆస్తులను అమ్మైనా డిపాజిట్ దారులకు న్యాయం చేయవచ్చునని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments