Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు నాయుడు వంశంలోనే పిచ్చి: అంబటి వ్యాఖ్య

Webdunia
గురువారం, 27 నవంబరు 2014 (19:31 IST)
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది అదో రకం పిచ్చి అని, ఆయన బావమరిది బాలకృష్ణకు మతిస్థిమితమని వైకాపా నేత అంబటి రాంబాబు ఆరోపించారు. పైగా.. చంద్రబాబు నాయుడు వంశంలోనే పిచ్చి ఉందన్నారు. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారన్న టీడీపీ నేతల వ్యాఖ్యలపై హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ అధికార పక్షంపై విపక్షాలు విమర్శలు చేస్తే సహృదయంతో స్వీకరించాల్సిన టీడీపీ నేతలు ఎదురు దాడి చేయడం సిగ్గుచేటన్నారు. 
 
ముఖ్యంగా.. జగన్‌కు మతిస్థిమితం లేదన్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆ మాటకొస్తే చంద్రబాబు బావమరిది బాలకృష్ణకు మతిస్థిమితం లేదని వైద్యులు ధ్రువీకరించిన సంగతి వాస్తవం కాదా? అని అంబటి ప్రశ్నించారు. 
 
అలాగే చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు మతిస్థిమితం లేక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న విషయం వాస్తవం కాదా? అని అడిగారు. అంతెందుకు, చంద్రబాబుకు జగన్‌కు వైద్యపరీక్షలు చేద్దాం, చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యవంతుడన్నా, జగన్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని నివేదిక ఇచ్చినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అంబటి రాంబాబు ప్రకటించారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments