Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫీజ్ కట్టలేదని.. లేటుగా వచ్చారని, హోమ్ వర్క్ చేయలేదని.. నగ్నంగా నిలబెట్టారు..

Webdunia
గురువారం, 27 డిశెంబరు 2018 (15:44 IST)
విద్యార్థులను నగ్నంగా నడిరోడ్డుపై నిలబెట్టిన విద్యా సంస్థ లైసెన్స్‌ను రద్దు చేశారు. హోమ్ వర్క్ చేయకుండా పాఠశాలకు వచ్చారనే కారణంతో కొందరు విద్యార్థులను నడిరోడ్డుపై నగ్నంగా నిలబెట్టిందో విద్యా సంస్థ. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు చైతన్య భారతి పాఠశాలలో చోటుచేసుకుంది. 
 
విద్యార్థులు హోమ్ వర్క్ రాసుకురాలేదని.. ఐదుగురు విద్యార్థుల బట్టలను ఊడదీయించిన టీచర్లు.. వారిని అందరూ చూసేలా స్కూలుకు వెలుపల నిలబెట్టారు. ఈ ఘటనపై వారి తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత రావడంతో విద్యాశాఖ స్పందించింది. 
 
ఈ ఘటనపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు చైతన్య భారతి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. పాఠశాలలోని విద్యార్థులను ఇతర పాఠశాలల్లో చేర్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది. హోమ్ వర్క్‌లు చేసుకోరాని పక్షంలో ఇలాంటి కఠినమైన శిక్షలను అమలు చేయడం ఏమిటని విద్యాశాఖ సీరియస్ అయ్యింది.
 
స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసింది. స్కూలుకు లేటుగా వస్తున్నారని, హోమ్ వర్క్ చేయలేదని, ఫీజులు సరిగ్గా కట్టట్లేదని చెప్తూ టీచర్ ఐదో తరగతి విద్యార్థుల బట్టలూడదీసి మండుటెండలో నిలబెట్టారని.. చిన్నారుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments