Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 గంట‌ల‌లోపు చైన్ స్నాచ‌ర్ అరెస్టు

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (11:29 IST)
గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణంలోని పండ‌రీపురం 8వ లైనులో ఈ నెల 8వ తేదీన సోమ‌వారం న‌డుచుకుంటూ వెళుతున్న అంబ‌డిపూడి శార‌ద అనే మ‌హిళ మెడ‌లోని 3 స‌వ‌ర్ల బంగారు గొలుసును ద్విచ‌క్ర‌వాహ‌నంపై వ‌చ్చిన దుండ‌గుడు లాక్కొని ప‌రారయ్యాడు.

ఈ మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న అర్బ‌న్ సీఐ రాజేశ్వ‌ర‌రావు 24 గంట‌ల‌లోపే ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణంలోని సంజీవ‌న‌గ‌ర్‌కు చెందిన బ‌త్తుల నాగేంద్ర‌బాబును అరెస్టు చేశారు. అత‌ని వ‌ద్ద నుంచి 3 స‌వ‌ర్ల బంగారు గొలుసు రిక‌వ‌రీ చేశారు.

ద్విచ‌క్ర‌వాహ‌నం సీజ్ చేశారు. నాగేంద్ర‌బాబు పెయింట్ ప‌ని చేస్తుంటాడు. అప్పుల పాల‌వ్వ‌డంతో దొంగ‌త‌నానికి పాల్ప‌డిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. కేసును త్వ‌రిత‌గ‌తిన చేధించిన అర్బ‌న్ ఎస్ ఐ ఫిరోజ్‌ను సీఐ రాజేశ్వ‌ర‌రావు అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అనన్య నాగళ్ల లాంచ్ చేసిన 23 మూవీ కోసీ కోయ్యంగానే సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments