Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే రాజధాని ఉండాలన్న నిబంధన ఎక్కడా లేదు : కేంద్రం క్లారిటీ

Webdunia
గురువారం, 10 సెప్టెంబరు 2020 (11:46 IST)
నవ్యాంధ్ర రాజధాని విషయంలో నెలకొన్న గందరగోళంపై కేంద్రం మరోమారు క్లారిటీ ఇచ్చింది. రాజధాని అంశంలో జోక్యం చేసుకోబోమని కేంద్రం స్పష్టం చేసింది. పైగా, విభజన చట్టం మేరకు ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని తేల్చి చెప్పింది. 
 
ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేయబోతున్నట్టు సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటన ఏపీలో రాజకీయ దుమారాన్ని రేపింది. ఈ అంశం ఇపుడు కోర్టు పరిధిలోకి చేరింది. ఈ క్రమంలో రాజధాని అంశంలో జోక్యం చేసుకోబోమంటూ ఇప్పటికే  ఏపీ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం రెండు సార్లు అఫిడవిట్ దాఖలు చేసింది. 
 
తాజాగా ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ, హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. మూడు రాజధానుల్లో కేంద్రం పాత్రపై మరింత క్లారిటీ ఇచ్చింది. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానులు తప్పులేదని కేంద్రం తేల్చిచెప్పింది. విభజన చట్టంలో ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని స్పష్టం చేసింది. 
 
మూడు రాజధానులపై కేంద్రం పాత్రపై పిటిషనర్‌ దోనే సాంబశివరావువి అపోహలేనని హోంశాఖ వెల్లడించింది. రాజధానికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తామని మాత్రమే చెప్పామని పేర్కొంది. రాజధాని లేదా రాజధానుల నిర్ణయంలో జోక్యం ఉండబోదని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం స్పష్టీకరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments