Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాపాదయాత్రకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలి : ఆర్ఆర్ఆర్ వినతి

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (13:36 IST)
అమరావతి ప్రాంత రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర హోం శాఖకు విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖ రాశారు. 
 
నవ్యాంధ్రకు రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న ప్రధాన డిమాండ్‌తో రైతులు అమరావతి నుంచి అరసవల్లి వరకు మహాపాదయాత్ర ప్రారంభించారని, దీనికి  వైకాపా శ్రేణుల నుంచి ముప్పు పొంచివుందని అందువల్ల ఈ పాదయాత్రకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని ఆ లేఖలో కోరారు. 
 
అమరావతి రైతులు దాదాపు వెయ్యి కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేస్తున్నారని గుర్తుచేశారు. ఈ పాదయాత్రకు టీడీపీ, కాంగ్రెస్, జనసేన పార్టీలతోపాటు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. పాదయాత్రకు రాష్ట్ర పోలీసులు అనుమతి నిరాకరించారని, రైతులు హైకోర్టులో పిటిషన్ వేయగా, విచారించిన న్యాయస్థానం యాత్రకు అనుమతి ఇచ్చిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
 
అయతే, రాజుధాని విషయంలో హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా రాష్ట్ర మంత్రులు మూడు రాజధానుల గురించి మాట్లాడుతున్నారని, తద్వారా కోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తోందని ఫిర్యాదు చేశారు. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బట్టి.. రైతుల పాదయాత్రలో అలజడి సృష్టించడమే లక్ష్యంగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఈ పాదయాత్రకు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో భద్రత కల్పించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments