Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాజధాని అమరావతి : పార్లమెంటులో స్పష్టం చేసిన కేంద్రం

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2023 (08:31 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతే అని కేంద్రం మరోమారు పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశాన్ని తమ దృష్టికి తీసుకునిరాలేదని కేంద్రం తేల్చి చెప్పింది. అందువ్లల ఆ మూడు రాజధానుల వ్యవహారం తమకు తెలియదని, నవ్యాంధ్ర రాజధాని మాత్రం అమరావతే అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ లిఖిపూర్వత సమాధానమిచ్చారు.
 
వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానిమిస్తూ విభజన చట్టం మేరకు ఏపీ రాజధానిగా అమరావతిని 2015లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిందని గుర్తు చేశారు. విభజన చట్టంలోని సెక్షన్ 5, 6 ప్రకారం రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు సంబంధించిన విషయంలో అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు కమిటీని ఏర్పాటు చేసిందన్నారు.
 
ఆ కమిటీ ఇచ్చిన సూచనలు, సలహాలు నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించగా, దాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేస్తూ నోటిఫికేషన్ జారీచేసిందని, ఆ తర్వాత సీఆర్డీయేను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments