Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రి 10 వరకు టీకాలు... వ్యాక్సినేష‌న్ ఉదృతికి కేంద్రం నిర్ణయం!

Webdunia
బుధవారం, 12 జనవరి 2022 (10:15 IST)
కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి రోజు వ్యాక్సిన్లను రాత్రి 10 గంటల వరకు పంపిణీ చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి రాజేశ్ భూషణ్ దేశంలోని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పలు సూచనలు చేస్తూ  లేఖ రాశారు. 
 
 
దేశ వ్యాప్తంగా కరోనా సోకినవారిలో కేవలం 5 నుంచి 10 శాతం మంది బాధితులకే ఆస్పత్రిలో చికిత్స అవసరం అవుతుందని తెలిపారు. మిగితా వారికి హోం ఐసోలేషన్ ఉంటే సరిపోతుందని తెలిపారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అర్థం లేకుండా ఉందని తెలిపారు. ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం కూడా ఉందని లేఖలో తెలిపారు. అందుకోసం అన్ని రాష్ట్రాల వైద్య సిబ్బంది సిద్దంగా ఉండాలని సూచించారు.


ఆస్పత్రులలో ఆక్సిజన్ తోపాటు బెడ్స్ కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. కరోనా సోకిన వారిని తరలించేందుకు అంబులెన్స్ లను కూడా సిద్ధంగా ఉంచాలని తెలిపారు. అలాగే ప్రయివేటు ఆస్పత్రులు, క్లినిక్ లు అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments