Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 నుంచి పంటధాన్యాల కోనుగోలు కేంద్రాలు.. దళారీ వ్యవస్ధకు చెక్!

Webdunia
సోమవారం, 14 అక్టోబరు 2019 (06:14 IST)
రైతులకు కనీస మద్దతు ధర గ్యారెంటీగా కల్పించాలని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈనెల 15నుంచే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.

ఈ కొనుగోలు కేంద్రాల్లో ప్రకటించిన మద్దతు ధరలకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.  రైతుల ఉత్పత్తులకు కనీస మద్దతు లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని,  రూ. ౩ వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటెచేస్తుందని సీఎం జగన్‌ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదిశగా ఆయన అనేక చర్యలు చేపట్టారు.

బడ్జెట్‌లో ధరలస్థిరీకరణకు కేటాయింపులు చేయడమే కాకుండా, రైతులు దళారులు బారని పడకుండా పంట చేతికొచ్చే సమయానికే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలంటూ సమీక్షా సమావేశాల్లో ఆదేశాలు జారీచేశారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి వై.యస్‌. జగన్‌ ఆదేశాల మేరకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ త్వరలో ఏర్పాటు చేయబోయే కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ప్రణాళిక సిద్దంచేసుకుంది.

ప్రతి రైతు తాము సాగు చేసిన పంటను గ్రామ వ్యవసాయ/ఉద్యానవన సహాయకుడు ద్వారా "ఈ క్రాప్‌" నందు నమోదు చేసుకోవాలని సూచించింది. దీనికోసం రైతులకు సమీపంలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో భాగంగా అక్టోబరు 15న మినుములు, పెసలు కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ ప్రారంభిస్తోంది. ఈ మేరకు పంటల కనీస మద్ధతు ధరల వివరాలను కూడా వెల్లడించింది. 
 
 
అక్టోబరు 15వ తేదీన 31 చోట్ల పెసలు, మినుములు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, ఆయా కేంద్రాల వివరాలను ప్రకటించింది. 
 
మినుముల కొనుగోలు కేంద్రాల వివరాలు : 
గుంటూరు జిల్లా వడ్లమూడి కేంద్ర గిడ్డంగుల కార్పోరేషన్‌ పరిధిలో తెనాలి, పొన్నూరు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కేంద్ర గిడ్డంగుల కార్పోరేషన్‌ పరిధిలో రంగంపేట.
కృష్ణా జిల్లా గుడివాడ కేంద్ర గిడ్డంగుల కార్పోరేషన్‌ పరిధిలో హనుమాన్‌ జంక్షన్‌, సిడబ్ల్యూసి రాయనపాడు పరిధిలో మైలవరం, పరిటాల
కర్నూలు జిల్లా నంద్యాల సిడబ్ల్యూసి పరిధిలో నంద్యాల, ఆళ్లగడ్డ సిడబ్ల్యూసి పరిధిలో ఆళ్లగడ్డ.
 నందికొట్కూరు సిడబ్ల్యూసి పరిధిలో నందికొట్కూరు. ఆత్మకూరు సిడబ్ల్యూసి పరిధిలో ఆత్మకూరు.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు స్టేట్‌ వేర్‌ హౌసింగ్ కార్పోరేషన్ పరిధిలో దెందులూరు, పెద్దపాడేరు, నిడదవోలు.
 తాడేపల్లి గూడెం సిడబ్ల్యూసి పరిధిలో నల్లజెర్ల, పోలవరం, కన్నయ్యగుట్ట, కృష్టారావుపేట. 
 
 
పెసలు కొనుగోలు కేంద్రాలు : 
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సిడబ్ల్యూసి పరిధిలో రంగంపేట.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సిడబ్ల్యూసీ పరిధిలో నందిగామం ఏఎంసి.
 రాయనపాడు సిడబ్ల్యూసి పరిధిలో పరిటాల, అల్లూరు, చౌటపల్లి, పొన్నవరం, మైలవరం.
కర్నూలు జిల్లా  నంద్యాల సిడబ్ల్యూసి పరిధిలో నంద్యాల. ఆళ్లగడ్డ సిబ్ల్యూసి పరిధిలో ఆత్మకూరు.
పశ్చిమగోదావరి జల్లా ఏలూరు ఎస్‌డబ్ల్యూసి పరిధిలో దెందులూరు, పెద్దపాడేరు, నిడదవోలు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం ఎస్‌డబ్ల్యూసి గౌడెన్ పరిధిలో జంగారెడ్డిగూడెం, నల్లజెర్ల, పోలవరం, కన్నయ్యగుట్ట, కృష్టారావుపేట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments