Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేమ్ ఇండియా కింద ఏపీకి 350 ఎలక్ట్రిక్ బస్సులు

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (19:13 IST)
"ఫేమ్ ఇండియా పథకం" కింద ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని ఎలక్ట్రికల్ బస్సులను కేటాయించారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మంగళవారం పార్లమెంట్లో ప్రశ్నించారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల, బ్యాటరీల తయారీలోనూ ఎవరికి అవకాశం ఇచ్చారని కూడా ప్రశ్నించారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్ దీనికి రాతపూర్వకంగా సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్ కు ఫేమ్ ఇండియా పథకం కింద 2015లో 40 ఎలక్ట్రిక్ బస్సులు, రెండో విడత (2019 ఏప్రిల్ 1) 350 బస్సులను కేటాయించినట్లు తెలిపారు. ఇందులో విశాఖపట్నానికి 100, విజయవాడకు 50, అమరావతికి 50, తిరుపతికి50, కాకినాడకు 50, తిరుపతి అంతర్గత రవాణాకు 50 బస్సులను కేటాయించినట్లు తెలిపారు. 
 
 
దీనికిగాను పది వేల కోట్ల రూపాయలను కేటాయించినట్లు పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల ప్రత్యేక పథకం కింద ఈ ఏడాది మే 12న కేంద్ర క్యాబినెట్ ఉత్పాదకత తో ముడిపడిన ప్రోత్సాహక పథకం (పి.ఎల్.ఐ)ను ఆమోదించినట్లు తెలిపారు. ఇప్పటికే వాహనాలను ఉత్పత్తి చేస్తున్న సంస్థలు ఈ ఎలక్ట్రిక్ వాహనాలను అనుబంధంగా ఉత్పత్తి చేసేందుకు ప్రోత్సాహకాన్ని ఇచ్చేందుకు గాను నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకుగాను 18,100 కోట్ల రూపాయలను కేటాయించినట్లు పేర్కొన్నారు. (అడ్వాన్సు ఆటోమేటిక్ ప్రొడక్షన్) ప్రత్యేక వాహనాల ఉత్పత్తి పథకం కింద 25,1935 వేల కోట్ల రూపాయలను రానున్న ఐదేళ్ల కోసం కేటాయించినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments