Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్ద నోట్ల రద్దు.. కోపంతో రెండు ఏటీఎంలను ధ్వంసం చేసిన కానిస్టేబుల్..

పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు కోపంతో ఉన్నారు. అల్లర్లు జరుగవచ్చునని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో నగదు రాలేదన్న కోపంతో ఓ పోలీసు కానిస్టేబుల్‌ రెండు

Webdunia
శనివారం, 19 నవంబరు 2016 (17:26 IST)
పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు కోపంతో ఉన్నారు. అల్లర్లు జరుగవచ్చునని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో నగదు రాలేదన్న కోపంతో ఓ పోలీసు కానిస్టేబుల్‌ రెండు ఏటీఎంలను ధ్వంసం చేసిన ఘటన శుక్రవారం రాత్రి విశాఖ జిల్లా పాడేరులో చోటుచేసుకుంది. పాడేరులో ప్రజలు డబ్బులు తీసుకోవడానికి ఒకే స్టేట్‌ బ్యాంక్‌ ఏటీఎం మాత్రమే ఉంది. 
 
రాత్రి డబ్బులు తీసుకోవడానికి ఆ ఏటీఎం వద్దకు వచ్చిన కానిస్టేబుల్‌ కొద్దిసేపు వరుసలో నిలబడ్డాడు. అతని వంతు వచ్చే సరికి ఏటీఎమ్ మిషీన్ పనిచేయలేదు. దీంతో కానిస్టేబుల్‌కి పట్టలేని కోపం వచ్చింది.

అంతే కోపాన్ని ఏ మాత్రం ఆపుకోలేక ఏటీఎం మిషీన్‌ను నాలుగైదు సార్లు కాలితో తన్నాడు. అయినా కోపం ఏమాత్రం తగ్గకపోవడంతో మళ్లీ యంత్రాన్ని ధ్వంసం చేశాడు. దీంతో ఆ రెండు ఏటీఎంలూ ధ్వంసమయ్యాయి. సమాచారం తెలుసుకున్న పాడేరు బ్యాంకు సిబ్బంది ఏటీఎం కేంద్రానికి తాళం వేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments