ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు రామ్ మూర్తి నాయుడు ఇకలేరు

సెల్వి
శనివారం, 16 నవంబరు 2024 (17:17 IST)
CBN Brother
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్‌మూర్తి నాయుడు  కన్నుమూశారు. రామ్‌మూర్తి నాయుడు గత 2-3 సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం నుంచి అతని పరిస్థితి విషమంగా మారడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం ఆయన ప్రాణాలు కోల్పోయారు. 
 
ఎన్నికల ప్రచారం కోసం మహారాష్ట్రలో ఉన్న చంద్రబాబు నాయుడు తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. అమరావతి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్న నారా లోకేష్ కూడా హైదరాబాద్ వెళ్తున్నారు. 
 
వచ్చే నెలలో నారా రోహిత్ పెళ్లి జరగాల్సి ఉండగా ఈ దుర్ఘటన జరిగింది. రామ్ మూర్తి నాయుడు గతంలో రాజకీయాల్లో ఉన్నారు. ఆయన 1994-1999 మధ్య చంద్రగిరి నుండి టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నారు. తరువాత కాంగ్రెస్‌లో చేరారు. 
 
ఇక చంద్రబాబు నాయుడితో రాజకీయ విభేదాలు ఉన్నాయి. విభేదాలు రాజకీయాల వరకే. వీరి కుటుంబాలు ఎప్పుడూ స్నేహపూర్వకంగానే ఉంటాయి. రోహిత్ సినీ కెరీర్‌కు అవసరమైనప్పుడల్లా చంద్రబాబు సపోర్ట్ చేశారు. రామ్ మూర్తి నాయుడు చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments