Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు రామ్ మూర్తి నాయుడు ఇకలేరు

సెల్వి
శనివారం, 16 నవంబరు 2024 (17:17 IST)
CBN Brother
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్‌మూర్తి నాయుడు  కన్నుమూశారు. రామ్‌మూర్తి నాయుడు గత 2-3 సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం నుంచి అతని పరిస్థితి విషమంగా మారడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం ఆయన ప్రాణాలు కోల్పోయారు. 
 
ఎన్నికల ప్రచారం కోసం మహారాష్ట్రలో ఉన్న చంద్రబాబు నాయుడు తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. అమరావతి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్న నారా లోకేష్ కూడా హైదరాబాద్ వెళ్తున్నారు. 
 
వచ్చే నెలలో నారా రోహిత్ పెళ్లి జరగాల్సి ఉండగా ఈ దుర్ఘటన జరిగింది. రామ్ మూర్తి నాయుడు గతంలో రాజకీయాల్లో ఉన్నారు. ఆయన 1994-1999 మధ్య చంద్రగిరి నుండి టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నారు. తరువాత కాంగ్రెస్‌లో చేరారు. 
 
ఇక చంద్రబాబు నాయుడితో రాజకీయ విభేదాలు ఉన్నాయి. విభేదాలు రాజకీయాల వరకే. వీరి కుటుంబాలు ఎప్పుడూ స్నేహపూర్వకంగానే ఉంటాయి. రోహిత్ సినీ కెరీర్‌కు అవసరమైనప్పుడల్లా చంద్రబాబు సపోర్ట్ చేశారు. రామ్ మూర్తి నాయుడు చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments