Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసు : సీఎం జగన్ తమ్ముడు, కడప ఎంపీ అవినాష్‌కు సీబీఐ పిలుపు

Webdunia
సోమవారం, 15 మే 2023 (22:01 IST)
వైకాపా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా, ఏపీ సీఎం, వైకాపా అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డికి వరుసకు తమ్ముడు అయ్యే కడప వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నుంచి మరోమారు పిలుపువచ్చింది. ఈ నెల 16వ తేదీన విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తమ ఎదుట హాజరుకావాలని సీబీఐ స్పష్టం చేసింది. కాగా వివేకా హత్య కేసులో అవినాష్ అనుమానితుడిగా ఉన్న విషయం తెల్సిందే. 
 
ఈ కేసు దర్యాప్తులో భాగంగా, ఈయన వద్ద సీబీఐ మూడుసార్లు విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డికి సీబీఐ నుంచి మరోమారు పిలుపువచ్చింది. కాగా, ఈ కేసులో అరెస్టు భయంతో అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, ఏప్రిల్ 25వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ఈ మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. దీంతో వివేకా హత్య కేసులో అవినాష్ ఏ క్షణమైనా అరెస్టు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments