సీబీఐకు కోర్టు లాస్ట్ ఛాన్స్... నేను హాజరుకాలేనంటున్న సీఎం జగన్

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (08:04 IST)
కేసుల విచారణకు తాను స్వయంగా హాజరుకాలేనని అందువల్ల తన తరపున న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరారు. ఈ మేరకు సీఎం జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
అదేసమయంలో పెన్నా ఛార్జిషీట్‌లో జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ మరోమారు గడువు కోరింది. పెన్నా సిమెంట్స్‌పై కౌంటరుకు చివరి అవకాశం ఇస్తున్నామని కోర్టు స్పష్టం చేసింది.
 
కాగా, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుపై సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు కఠువుగా వ్యాఖ్యానించింది. జగన్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐకి ఇదే చివరి అవకాశమని తెలిపింది. పెన్నా కేసులో విజయసాయి రెడ్డి, సబిత, శామ్యూల్, రాజగోపాల్ డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది.
 
మరోవైపు అరబిందో, హెటిరో కేసుల వాదనలు వినిపించేందుకు కోర్టును ఈడీ గడువు కోరింది. నిందితులు కూడా వాదనలకు సిద్ధం కావాలని కోర్టు స్పష్టం చేసింది. తన బదులు న్యాయవాది హాజరుకు అనుమతి ఇవ్వాలని జగన్‌ న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు దాఖలు చేసిన పిటిషన్​పై ఈ నెల 13 విచారణ జరుపనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

సంగీత్ శోభన్ హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం

విలేజ్ లో జరిగిన జరుగుతున్న కథతో రాజు వెడ్స్ రాంబాయి తీశాం - సాయిలు కంపాటి

ఈ సినిమా కోసం సావిత్రి, శ్రీదేవి సినిమాలు చూశాను : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments