Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి అమావాస్యకు మాపై కేసులు: దేవినేని

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (16:10 IST)
తిరుపతి: రాష్ట్రంలో అరాచక, దుర్మార్గపు పాలన సాగుతోందని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారని ఆక్షేపించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి అమావాస్యకు తెదేపా నేతలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తనపై సీఐడీ కేసు ఎందుకు పెట్టారని ఉమ ప్రశ్నించారు.
 
‘‘తిరుపతిపై సీఎం అంతరంగాన్ని మీడియాకు చూపితే నాపై కేసులా? మార్ఫింగ్‌ చేశానని తప్పుడు కేసులు బనాయిస్తారా? రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారా? తప్పుడు కేసులు పెడితే భయపడేది లేదు. మాజీ మంత్రి వివేకాది గుండెపోటు అని చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డిపై కేసు పెట్టాలి’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కృష్ణా జలాలను రాష్ట్ర ప్రభుత్వం తాకట్టు పెట్టిందని.. దీనిపై రాష్ట్ర హక్కులను వదిలేశారని దేవినేని ఉమ ఆరోపించారు. కృష్ణా బోర్డు పరిధిలో లేని ప్రాజెక్టులను దాని పరిధిలోకి తెచ్చారని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments