Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటీఎంలో చెత్త.. బ్యాంకు మేనేజర్‌పై తిట్ల పురాణం : జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు!

Webdunia
మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (11:05 IST)
ఓ ఏటీఎం కేంద్రంలో చెత్త ఉండటాన్ని జీర్ణించుకోలేక పోయిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఏటీఎం సెంటర్‌కు తాళాలు వేశారు. ఈ విషయం తెలుసుకున్న బ్యాంకు మహిళా బ్యాంకు మేనేజర్ ఆయన ఇంటికి వెళ్లగా తిట్ల పురాణం అందుకున్నాడు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డిపై బ్యాంకు మేనేజర్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే.. మూడు రోజుల క్రితం తాడిపత్రిలోని స్టేట్ బ్యాంక్ ఏటీఎం వద్ద చెత్త ఎక్కువగా పడి ఉండడం చూసిన జేసీ ప్రభాకర్ రెడ్డికి విపరీతమైన ఆగ్రహం వచ్చింది. వెంటనే ఏటీఎంకు తాళాలు వేసి ఇంటికి తీసుకొచ్చేశారు. దీంతో విషయం తెలిసిన ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ సుప్రజ సిబ్బందితో కలిసి తాళం తీసుకోవడానికి జేసీ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా జేసీ బ్యాంకు సిబ్బందిపై తిట్ల పురాణం అందుకున్నారు. జేసీ తిట్లతో అవాక్కయిన చీఫ్ మేనేజర్ సుప్రజ డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు.
 
మునిసిపాలిటీ అభివృద్ధికి విరాళం ఇవ్వలేదని ఎమ్మెల్యే తమను దూషించారని... తనతో పాటు బ్యాంకుకు కూడా జేసీ బ్రదర్స్ నుంచి భద్రత కల్పించాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు అనేక తర్జనభర్జనలు పడి చివరకు జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసును నమోదు చేసుకున్నారు. 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments