Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటీఎంలో చెత్త.. మేనేజర్‌ను తిట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. కేసు..

Webdunia
మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (15:34 IST)
ఓ ఏటీఎం కేంద్రంలో చెత్త ఉండటాన్ని జీర్ణించుకోలేక పోయిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఏటీఎం సెంటర్‌కు తాళాలు వేశారు. ఈ విషయం తెలుసుకున్న బ్యాంకు మహిళా బ్యాంకు మేనేజర్ ఆయన ఇంటికి వెళ్లగా తిట్ల పురాణం అందుకున్నాడు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డిపై బ్యాంకు మేనేజర్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే.. మూడు రోజుల క్రితం తాడిపత్రిలోని స్టేట్ బ్యాంక్ ఏటీఎం వద్ద చెత్త ఎక్కువగా పడి ఉండడం చూసిన జేసీ ప్రభాకర్ రెడ్డికి విపరీతమైన ఆగ్రహం వచ్చింది. వెంటనే ఏటీఎంకు తాళాలు వేసి ఇంటికి తీసుకొచ్చేశారు. దీంతో విషయం తెలిసిన ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ సుప్రజ సిబ్బందితో కలిసి తాళం తీసుకోవడానికి జేసీ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా జేసీ బ్యాంకు సిబ్బందిపై తిట్ల పురాణం అందుకున్నారు. జేసీ తిట్లతో అవాక్కయిన చీఫ్ మేనేజర్ సుప్రజ డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు.
 
మునిసిపాలిటీ అభివృద్ధికి విరాళం ఇవ్వలేదని ఎమ్మెల్యే తమను దూషించారని... తనతో పాటు బ్యాంకుకు కూడా జేసీ బ్రదర్స్ నుంచి భద్రత కల్పించాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు అనేక తర్జనభర్జనలు పడి చివరకు జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసును నమోదు చేసుకున్నారు. 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments