ఏలూరులో పోలీసులపై తిరగబడిన స్థానికులు

Webdunia
సోమవారం, 11 ఏప్రియల్ 2022 (09:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసుల వైఖరిపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. తాజాగా ఏలూరులో పోలీసులపై స్థానికులు దాడి చేశారు. కోడిపందాలు, పేకాట ఆడుతున్న బృందాలపై పోలీసులు దాడులు చేశారు. దీంతో తిరగబడిన స్థానికులతో కలిసి పేకాట రాయుళ్ళు పోలీసులపై దాడికి తెగబడ్డారు. ఎస్ఐతో పాటు పలువురు కానిస్టేబుళ్ళను తరిమికొట్టారు. 
 
ఈ ఘటన ఏలూరు లింగపాలెం మండలం యడవల్లి గ్రామంలో చోటుచేసుకుంది. సమాచారం మేరకు గ్రామంలో కొందరు వ్యక్తులు పేకాట, కోడిపందాలు ఆడుతున్నట్లు స్థానికుల సమాచారం మేరకు ధర్మాజీగూడెం పోలీసులు యడవల్లి గ్రామంలో దాడులు నిర్వహించారు.
 
పోలీసులను చూడగానే కార్డుదారులు ఎదురుపడి పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఉమా మహేశ్వర్‌రావు, ఇతర కానిస్టేబుళ్లు గాయపడగా వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనలు రేపుతోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments