Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు ప్రమాదం.. ముగ్గురు మృతి : తిరుపతిలో చిరుజల్లులు

Webdunia
సోమవారం, 9 మే 2016 (20:41 IST)
చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం నిట్టూరు సమీపంలో ఓ సుమో అదుపుతప్పి ఇంటి గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో సుమోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. తిరుపత్తూరుకు చెందిన ఆరు మంది కుటుంబ సభ్యులు పుత్తూరు సమీపంలోని కైలాసకోనకు వచ్చి తిరిగి తిరుగు ప్రయాణమవుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. 
 
తిరుపతిలో చిరుజల్లుల వర్షం
తిరుపతిలో చిరుజల్లులతో కూడిన వర్షం పడింది. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు ఎండ వేడితో ఇబ్బంది పడిన పట్టణ ప్రజలకు ఒక్కసారిగా ఉపశమనం పొందారు. ఈదురుగాలులతో చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వాహనదారులు చిరుజల్లులలోనే తడుస్తూ వాహనాలు నడుపుతున్నారు. చిన్నపిల్లలు కేరింతలు ఆడుతూ వర్షంలో తడుస్తూ కేరింతలు కొట్టారు. ఈ చిరు జల్లుల కారణంగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కటౌట్ చూసి నమ్మేయాలి డ్యూడ్ అంటూ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

Bigg Boss 8: ప్రేమపక్షులుగా మారిన విష్ణుప్రియ, పృథ్వీ..

ధూమ్ 4 భారీ బడ్జెట్ సీక్వెల్- హీరోయిన్ రేసులో వున్న సమంత!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ వ్యాధులకు మునగకాయలు దివ్యౌధంలా పనిచేస్తాయి, ఏంటవి?

రోజుకు ఒక్కసారి 4 టీ స్పూన్ల తులసి రసం తాగితే?

జీడిపప్పుకు అంత శక్తి వుందా?

ఫెర్టిలిటీ ఆవిష్కరణలపై ఫెర్టిజ్ఞాన్ సదస్సు కోసం తిరుపతిలో సమావేశమైన 130 మంది నిపుణులు

కాఫీలో నెయ్యి వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments