Webdunia - Bharat's app for daily news and videos

Install App

77వ రోజుకు రాజధాని ఆందోళనలు

Webdunia
మంగళవారం, 3 మార్చి 2020 (08:26 IST)
అమరావతి రాజధాని రైతుల ఆందోళనలు 77వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో రైతుల ధర్నా కొనసాగుతోంది. అటు వెలగపూడిలో 77వ రోజు రిలేదీక్షలు కొనసాగుతున్నాయి.

పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలులో రైతులు ధర్నాలు చేయనున్నారు. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. 
 
గత ప్రభుత్వంలో ఎన్టీఆర్‌ హౌసింగ్‌ పథకం కింద తమకు కేటాయించిన ఇళ్లను వెంటనే అప్పగించాలని రాజధాని లబ్ధిదారులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు మూకుమ్మడిగా సీఆర్‌డీఏకు అర్జీలు సమర్పించారు.

5,200 ఇళ్లకుగాను ఎలాట్‌మెంట్‌లు ఇచ్చారని దానికోసం వడ్డీలకు తెచ్చి రూ.లక్ష నుంచి రూ.500 వరకు ప్రభుత్వానికి కట్టామని తెలిపారు.

అన్నీ సిద్ధంగా ఉన్న ఇళ్లను తమకు ఇవ్వకుండా ఇక్కడి భూములను ఎక్కడో పేదలకు ఇస్తామనడం మాలో మాకు తగవులు పెట్టడం కాదా..? అని నిలదీశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments