Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు: నిందితుడు శివకృష్ణను చనిపోయేవరకూ ఉరి తీయండి

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (21:54 IST)
గత ఏడాది ఆగస్టు 15న అత్యంత దారుణంగా ప్రేమోన్మాది శివకృష్ణ, బీటెక్ విద్యార్థిని రమ్యను కత్తితో పొడిచి హత్య చేసాడు. పట్టపగలే అందరూ చూస్తుండగా ఆమెను పాశవికంగా పొట్టనబెట్టుకున్నాడు. ఈ కేసుపై గత ఏడాది డిశెంబరు నెల నుంచి కోర్టులో విచారణ ప్రారంభమై ఈ నెల 26తో ముగిసింది.

 
గుంటూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నిందితుడికి శిక్ష విధిస్తూ... స్వాతంత్ర దినోత్సవం నాడు పట్టపగలే అందరూ చూస్తుండగా విద్యార్థినిని నిందితుడు హత్య చేసాడనీ, ఇంత దారుణం చేసినా అతడిలో ఎలాంటి మార్పు రాకపోగా కోర్టు నుంచి పారిపోయే ప్రయత్నం చేసాడని వ్యాఖ్యానించారు. తప్పు చేసానన్న భావన అతడిలో ఎంతమాత్రం కనిపించడంలేదనీ, ఇతడికి మరణశిక్ష సరైనదిగా భావిస్తున్నట్లు తెలిపారు.

 
ఈ కేసులో హత్యకు గురైన రమ్యకు శివకృష్ణ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యాడు. ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకుని తనను ప్రేమించాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. అతడి వేధింపులు తాళలేక అతడి ఫోన్ నెంబరును బ్లాక్ చేసింది. దీనితో ఆ ప్రమోన్మాది గుంటూరులో పట్టపగలే నడిరోడ్డుపై ఆమెను కత్తితో పొడిచి హత్య చేసాడు. సీసీ కెమేరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితుడిని పోలీసులు 24 గంటలు గడవకముందే నరసరావుపేటలో అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya 46: వెంకీ అట్లూరితో సూర్య సినిమా.. పూజా కార్యక్రమాలతో ప్రారంభం

బొద్దుగా మారిన పూనమ్ కౌర్... : ఎందుకో తెలుసా?

చిత్రపురిలో రియల్ ఎస్టేట్ ను నియంత్రిచండంటూ సి.ఎం.కు పోరాట సమితి వినతి

Surekha Vani: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సురేఖా వాణి కుమార్తె సుప్రీత

నేను చచ్చేవరకు మోహన్ బాబు గారి అబ్బాయినే : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments