బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు: నిందితుడు శివకృష్ణను చనిపోయేవరకూ ఉరి తీయండి

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (21:54 IST)
గత ఏడాది ఆగస్టు 15న అత్యంత దారుణంగా ప్రేమోన్మాది శివకృష్ణ, బీటెక్ విద్యార్థిని రమ్యను కత్తితో పొడిచి హత్య చేసాడు. పట్టపగలే అందరూ చూస్తుండగా ఆమెను పాశవికంగా పొట్టనబెట్టుకున్నాడు. ఈ కేసుపై గత ఏడాది డిశెంబరు నెల నుంచి కోర్టులో విచారణ ప్రారంభమై ఈ నెల 26తో ముగిసింది.

 
గుంటూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నిందితుడికి శిక్ష విధిస్తూ... స్వాతంత్ర దినోత్సవం నాడు పట్టపగలే అందరూ చూస్తుండగా విద్యార్థినిని నిందితుడు హత్య చేసాడనీ, ఇంత దారుణం చేసినా అతడిలో ఎలాంటి మార్పు రాకపోగా కోర్టు నుంచి పారిపోయే ప్రయత్నం చేసాడని వ్యాఖ్యానించారు. తప్పు చేసానన్న భావన అతడిలో ఎంతమాత్రం కనిపించడంలేదనీ, ఇతడికి మరణశిక్ష సరైనదిగా భావిస్తున్నట్లు తెలిపారు.

 
ఈ కేసులో హత్యకు గురైన రమ్యకు శివకృష్ణ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యాడు. ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకుని తనను ప్రేమించాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. అతడి వేధింపులు తాళలేక అతడి ఫోన్ నెంబరును బ్లాక్ చేసింది. దీనితో ఆ ప్రమోన్మాది గుంటూరులో పట్టపగలే నడిరోడ్డుపై ఆమెను కత్తితో పొడిచి హత్య చేసాడు. సీసీ కెమేరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితుడిని పోలీసులు 24 గంటలు గడవకముందే నరసరావుపేటలో అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments