కమలాపురంలో కూలిన పాపాగ్ని నది వంతెన ... రాకపోకలు బంద్

Webdunia
ఆదివారం, 21 నవంబరు 2021 (10:17 IST)
ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలు జిల్లాల్లో వరద నీరు బీభత్సం సృష్టించింది. ఈ నష్టం కడప జిల్లాలో అధికంగా ఉంది. తాజాగా ఈ జిల్లాలోని కమలాపురం పాపాగ్ని నదిపై ఉన్న వంతెన గత అర్థరాత్రి కూలిపోయింది. వెలిగల్లు జలాశయం నుంచి నాలుగు గేట్లు ఎత్తివేయడంతో ఈ నదికి వరద నీరు ఒక్కసారిగా పోటెత్తింది. 
 
అప్పటికే వంతెన బాగా నాని వుండటంతో పాటు గత రెండు రోజులుగా ఈ నది ప్రమాదకరంగా ప్రవహిస్తూ వచ్చింది. కొత్తగా వెలిగల్లు వరద నీరు ఒక్కసారిగా ఉధృతంగా రావడంతో వెంతన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 
 
ఈ బ్రిడ్జిపై నుంచే అనంతపురం నుంచి కడపకు వెళ్లే జాతీయ రహదారి వుంది. దీంతో ఈ మార్గంలో వెళ్లే వాహనరాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయు. ఈ వంతెన నిర్మాణ పూర్తయ్యేంత వరకు రాకపోకలు బంద్ అయినట్టే. అయితే, ఈ వంతెన కూలిపోవడంతో ఈ మార్గంలో వెళ్లాల్సిన వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. ఈ పరిస్థితి నెల రోజుల పాటు కొనసాగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ది తో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుంది : శివరాజ్ కుమార్‌

Vaishnavi : ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ నుండి ప్రియసఖి మెలోడీ గీతం విడుదల

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

తర్వాతి కథనం
Show comments